Header Banner

రూ.500 నోటుపై వైరల్ పోస్టులకు ఫుల్‌స్టాప్! ఆర్బీఐ క్లారిటీ ఇదే!

  Mon May 05, 2025 13:23        Others

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్ ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 500 రూపాయల నోటును చెలామణి నుండి తొలగించాలని నిర్ణయించిందని చెబుతున్నారు. రాబోయే కాలంలో 90 శాతం ATMల నుండి 100, 200 రూపాయల నోట్లు మాత్రమే బయటకు వస్తాయని కూడా వైరల్ పోస్ట్ పేర్కొంది.

ఆ వైరల్ పోస్ట్ లో ఏముంది?
ఈ వైరల్ పోస్ట్‌లో ఆర్బీఐ బ్యాంకులు తమ ఏటీఎంలలో 100, 200 రూపాయల నోట్ల సంఖ్యను పెంచాలని ఆదేశించిందని చెప్పే స్క్రీన్‌షాట్ ఉంది. ఈ పోస్టులను చూసిన కొందరు రూ.500 నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు భావిస్తున్నారు.

అసలు ఆర్‌బిఐ సర్క్యూలర్‌ ఏం చెబుతోంది?
అయితే విషయాన్ని పరిశోధించినప్పుడు ఆర్బీఐ బ్యాంకులకు నిజంగానే ఒక ఆదేశం జారీ చేసింది. అయితే, ఈ ఆదేశంలో రూ.500 నోటును నిలిపివేయడం గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అసలు RBI ఆదేశం ఏమిటంటే బ్యాంకులు తమ ATMలలో రూ.100, రూ.200 నోట్ల లభ్యతను పెంచాలనేది.

ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

ఆర్‌బీఐ ఉద్దేశ్యం ఏమిటి?
సాధారణ ప్రజలకు చిన్న నోట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవడమే ఆర్బీఐ ఉద్దేశం. తరచుగా ప్రజలు ATM నుండి రూ. 500 లేదా రూ. 2000 నోట్లను విత్‌డ్రా చేసిన తర్వాత వాటిని చల్లర చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. చిన్న దుకాణదారులు, సాధారణ ప్రజల వద్ద తరచుగా పెద్ద నోట్లకు బదులుగా చిల్లర ఉండదు. ప్రజలు ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండటానికి ఏటీఎంల నుండి నేరుగా చిన్న నోట్లను పొందాలనే ఉద్దేశంతో ఆర్బీఐ బ్యాంకులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

500 రూపాయల నోటును నిలిపివేస్తున్నారా?
రూ.500 నోట్లను ఆర్బీఐ నిలిపివేస్తుందా? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఆర్బీఐ బ్యాంకులకు జారీ చేసిన ఆదేశాల్లో ఈ 500 నోటును నిలిపివేస్తున్నట్లు ఎటువంటి సూచనను ఇవ్వలేదు. ఈ నోటు మునుపటిలాగే చెలామణిలో ఉంటుంది. వైరల్ పోస్ట్‌లో చెప్పిన విషయాలు పూర్తిగా తప్పు. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త పూర్తిగా తప్పు. 500 రూపాయల నోటును నిషేధించాలని ఆర్‌బిఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏటీఎంలలో 100, 200 రూపాయల నోట్ల సంఖ్యను పెంచాలని మాత్రమే బ్యాంకులకు సూచించింది. తద్వారా చిన్న నోట్లు సాధారణ ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంటాయి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

నేడు (5/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RBI #500RupeeNote #RBIClarification #FakeNewsAlert #CurrencyFacts #ViralRumors #StopMisinformation #IndianCurrency